తాంసి, అక్టోబర్ 26 : బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా తాంసి మండలం నిలుస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో అనిల్ జాదవ్కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కప్పర్ల ఎక్స్ రోడ్డు నుంచి ప్రారంభమై జామిడి, తాంసి గ్రామాల మీదుగా సాగింది. ఆయుషా గార్డెన్లో ఆడబిడ్డలు మంగళహారతులతో స్వాగతం పలికారు. దాదాపు 500 ద్విచక్రవాహనాలతో ర్యాలీ కొనసాగింది. గ్రామాలు గులాబీ మయమయ్యాయి.
అనంతరం ఉండం సమీపంలో గల ఆయుషా గార్డెన్లో ఏర్పాటు చేసిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో అనిల్ జాదవ్ పాల్గొన్నారు. వారితోపాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి, మాజీ ఎంపీ నగేశ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి హాజరయ్యారు. మహిళలు బతుకమ్మ పాటలపై నృత్యాలు చేశారు.
మహిళలతోపాటు ఎమ్మెల్యే జోగు రామన్న, ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ కోలాటాలు ఆడి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. పది వేల ఓట్లు తాంసి మండలం నుంచి కారు గుర్తుకు పడేలా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.
ఈనెల మంత్రి హరీశ్రావ్ ఆదిలాబాద్ జిల్లాకు రానున్నారని వారి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ గొడం నగేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకుల మాటలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. బోథ్ ఎమ్మెల్యేగా అనిల్ జాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాటిపల్లి రాజు, ఎంపీపీ సురకుంటి మంజుల శ్రీధర్రెడ్డి, వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ రఘు, సర్పంచ్లు స్వప్న, సదానందం, వెంకన్న, తూర్పుబాయి యశ్వంత్, అండె అశోక్, అలాలి జ్యోతి నర్సింగ్, కుంట సరిత కేశవ్ రెడ్డి, మునేశ్వర్ భరత్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.