బజార్హత్నూర్, అక్టోబర్ 19 : బీఆర్ఎస్తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ జీ నగేశ్ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని తిరుమల ఫంక్షన్హాల్లో గురువా రం ఆత్మీయ సమ్మేళన కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నగేశ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను అత్యుద్భుతంగా రూపొదించారని దీనిని ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి అనిల్ జాదవ్ గెలుపునకు కృషి చేయాలని కోరారు.
అనంతరం బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ మాట్లాడుతూ తనకు ఎమెల్యేగా ఒక్కసారి అవకాశం ఇస్తే మీ కష్టాల్లో పాలుపంచుకుంటానని, అంతేగాకుండా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీచ్చారు. అలాగే మండలవాసుల చిరకాల వాంఛ మోర్కండి నుంచి దేవ్పూర్ మీదిగా ఆదిలాబాద్ వెళ్లే సులభమైన రోడ్డు పనులు కూడా వెంటనే ప్రారంభించేలా చూస్తానని పేర్కొన్నారు.
అంతకుముందు పిప్పిరి గ్రామం నుంచి 1000మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీగా గిర్నూర్, బలన్పూర్, బజార్హత్నూర్ గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా బైక్ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ లావ ణ్య, ఎంపీటీసీ తిరుమల, పీఏసీఎస్ చైర్మన్ వెంక న్న, బోథ్ ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, నాయకులు నానం రమణ, చిల్కూరి భూ మయ్య, మునేశ్వర్ నారాయణ, పవన్కుమార్, దీశి రమణ, సాయన్న, మడిగె రమేశ్, తాండ్ర శీనివాస్, నారడి మల్లేశ్, శరత్, భోజన్న, జనార్దన్, అజేయ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ సమక్షంలో బీజీపీ నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. వారిలో చట్ల గజ్జయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ చట్ల వినిల్ విరితో పాటు పడిపెల్లి గంగయ్య, దనగరి రాములు, బాలేరావ్ రాములు, యువకులు చట్ల తరుణ్, సాయి, మణికంఠ, అరుణ్, వరుణ్, శేఖర్ తదితరులు ఉన్నారు.
తలమడుగు, అక్టోబర్ 19 : బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై బీఆర్ఎస్లో చేరినట్లు మండలంలోని ఝరి పం చాయతీ పరిధిలోని టొక్కిగూడ మాజీ సర్పంచ్ జనక్, యువకులు పేర్కొన్నారు. బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ సమక్షంలో గురువారం పార్టీలో చేరగా ఆయన కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు పాటుపడుతామన్నారు. యువకులు హనుమం తు, మాణిక్, శేఖర్, రవీందర్, సందీప్, విఠల్, లక్ష్మణ్, జైరాం, లక్ష్మణ్, చందర్, సకారాం, ఓం ప్రకాశ్, మహిళలు పాల్గొన్నారు.
దస్తురాబాద్, అక్టోబర్ 19 : బీఆర్ఎస్ పార్టీ అం టే భరోసా అని బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మె ల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. మండలకేంద్రంలో ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు.అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. బీఫాం అందుకున్న తర్వా త తొలిసారి మండలానికి వచ్చిన ఆయనను ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సన్మానించారు.