ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కేంద్రం సమాధానం చెప్పాలి
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న
డోప్టాలలో 100 మంది టీఆర్ఎస్లో చేరిక
బేల,మే 17 : సీసీఐ పరిశ్రమ విషయంలో కమలనాథులది నమ్మకద్రోహమని, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ దొంగ పార్టీలని, వాటిని నమ్మే పరిస్థితిలో లేదన్నారు. మంగళవారం బేల మండలం డోప్టాలలో బీజేపీకి చెందిన 100 మందికి పైగా టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే జోగురామన్న వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. అంతకు ముందు సవారీ బంగ్లా ముందుగా రూ. 5 లక్షలతో షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామన్న మా ట్లాడారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు కేవలం తెలంగాణలోనే అమలవుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.
లోయర్ పెన్గంగ ప్రాజెక్టు చనకా-కొరటా బ్యారే జ్ ద్వారా 50 వేల ఎకరాలకు సాగు నీరు అందిం చే కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతుంటే, బీజేపీ నాయకులు మాత్రం సీసీఐని అమ్ముకునే పనిలో పడ్డారని మండిపడ్డారు. యువత భవిష్యత్ను, బెల్లూరి భూ నిర్వాసితులను గాలికి వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పరిశ్రమ తెరిపించాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాసినా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదన్నారు. కేంద్ర మాజీ మంత్రి హంసరాజ్ గంగారామ్ పరిశ్రమను తెరిపిస్తామంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు అమ్ముకునే ఆలోచన చేయడంపై జిల్లా వాసులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, సతీశ్ పవర్, ప్రమోద్రెడ్డి, దేవన్న, బండి సుదర్శన్, మంగేశ్ ఠాక్రే, ఇంద్రశేఖర్, విపిన్, దీపక్ గౌడ్, సురేశ్, మెట్టు ప్రహ్లాద్, వైద్యకిషన్ రావు, రాకేశ్, అంకత్ రాజన్న, సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.