రెబ్బెన, జనవరి 11: మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో గురువారం ముందస్తు భోగి, సంక్రాంతి వేడు కలు వైభవంగా నిర్వహించారు. గోలేటిటౌన్ షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో తపస్వీ ఏజెన్సీ ఆధ్వర్యంలో విప్రో సంతూర్ వారి సౌజన్యంతో బాలికలకు ముగ్గుల పోటీ లు నిర్వహించి గెలుపొందిన వారికి రెబ్బెన సీఐ అల్లం నరేందర్, గోలేటి సర్పంచ్ పొటు సు మలత బహుమతులు అందించారు.
పులికుంట గ్రామ పంచాయతీలోని పులికుంటకాలనీ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పొంగల్ తయారు చేయడం, హరిదాసు వేషధారణ, బోగి మంటలు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లేతన్గూడ, రేకులగూడ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంలు దోడ్డిపట్ల రవికుమార్, కోల మహేశ్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సింగరేణి స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం బాలునాయక్, పీఈటీ భాస్క ర్, లయన్స్ క్లబ్ సభ్యులు వంగ మ హేందర్రెడ్డి, జగడం సత్యనారాయణ, కుందారపు నరేశ్, ఎస్ఎంపీ చైర్మన్ శ్రీనివాస్, వార్డుమెంబర్ అంజలి పాల్గొన్నారు.
సిర్పూర్(యు),జనవరి 11: మండలకేంద్రంలోని ఆవరణలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థినులతో పాటు ఉపాధ్యాయినిలకు సైతం గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కంప్యూటరీ కరణ కాలంలో సనాతన సంస్కృతులను విడనాడుతున్న తరుణంలో వాటిని తిరిగి కాపాడడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాల ప్రవేశపెడుతున్నాయని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈ పోటీలు నిర్వహించామన్నారు. ఈ ము గ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులకు బహుమతులను అందజేస్తామన్నారు. కార్యక్రమం లో ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
బెజ్జూర్, జనవరి 11 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఎంపీటీసీ ఫర్వీన్ సుల్తానా ఆధ్వర్యం లో సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొద టి బహుమతిని పూసాల అక్షిత, ద్వితీయ బహుమతిని ఆదె మానస, తృతీయ బహుమతిని నికాడి శ్రీజలు దక్కించుకున్నా రు. వీరి తో పాటు పోటీల్లో పాల్గొన్న వారికి కన్సోలేషన్ బహుమతులు కూడా అందజేశారు. నా యకుడు జావీద్ అలీఖాన్, ఉపాధ్యాయులు శ్రీనాథ్, రవికుమార్, జమీల్, యాకూబ్, ఆశాజ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.