భైంసా, డిసెంబర్ 26 : భైంసా ఏరియా దవాఖాన వైద్యుల సేవలు భేష్ అని సూపరింటెండెంట్ కాశీనాథ్ అన్నారు. కుభీర్ మండలం పార్డి(బీ) గ్రామానికి చెందిన సంధ్య రెండో కాన్పు కోసం ఆదివారం రాత్రి భైంసా దవాఖానకు పరీక్షలు జరిపిన డాక్టర్లు పద్మావతి, విజయ కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. కణితిని తొలగించి ప్రసవం చేశారు.
రెండో కాన్పులో సంధ్య ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.