బెల్లంపల్లి, మార్చి 14 : బెల్లంపల్లి శాఖ గ్రంథాలయం ఇక నుంచి ప్రతి రోజూ పన్నెండు గంటలు పని చేయనున్నది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వర కు తెరచి ఉండనున్నది. బెల్లంపల్లి శాఖ కాళోజీ గ్రంథాల యంలో నెలకొన్న సమస్యలపై గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ‘గప్పుడెంట్లుండే.. గిప్పుడెట్లయ్యింది’ పేరిట కథనం ప్రచురితం కాగా, సంబంధిత అధికారులు స్పందించారు. 12 గంటలు గ్రంథాలయం తెరిచి ఉంచి, పుస్తకాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకో వాలని గ్రంథాలయాధికారి ఉప్పు గోపిని ఆదేశించారు. గురువారం నుంచే పని వేళలు అమలు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వీపర్ నీలి రమేశ్, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రంథాలయాధికారి ఉప్పు గోపి, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అటెండర్ ఇరుగురాల శ్రీనివాస్ విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక నుంచి ప్రతి శుక్రవారం, రెండో శనివారం కూడా గ్రంథాలయం కొనసాగనున్నది. గ్రంథాలయంలో నెలకొన్న సమస్యలను అధికారులు, దాతల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేసిన ‘నమస్తే తెలంగాణ’కు అభ్యర్థులు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు.
‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఎన్ఆర్ఐ బూడిద గడ్డ బస్తీకి చెందిన తోడే వెంకట కృష్ణారెడ్డి స్పందించారు. శని, ఆదివారాలు 70 మంది పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తానని తెలిపారు. దాతలు ముందుకు రాని పక్షంలో మిగతా ఐదు రోజులు కూడా భోజనం పెడతానని చెప్పారు. మాజీ కౌన్సిలర్ తోడే వంశీ కృష్ణారెడ్డి స్మారకార్థం స్టడీ మెటీరీయల్ను అందిస్తామని తెలిపారు. రెండేళ్ల కితం తోడే వంశీ కృష్ణారెడ్డి రూ.60 వేల విలువైన పుస్తకాలను గ్రంథాలయానికి అందించారు. ఏ సమస్య ఉన్నా చేయూతనందిస్తానని స్పష్టం చేశారు.