తాండూర్, ఏప్రిల్ 17 : ముస్లిం మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. రంజాన్ పండుగను పురష్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాండూరు, ఐబీ మసీదుల్లో సోమవారం ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందించే విందులు మత సామరస్యానికి ప్రతీకగా, సమాజంలో ఐక్యతను చాటుతున్నాయన్నారు. అన్ని వర్గాలు ఐక్యతతో పండుగలను నిర్వహించుకోవాలన్నారు.
కార్యక్రమాలలో ముస్లిం మతపెద్దలు, జెడ్పిటీసీ బానయ్య, పార్టీ అధ్యక్షుడు దత్తుమూర్తి, ఎంపీటీసీలు సిరంగి శంకర్, మొగిలి శంకర్, రైతు బందు అధ్యక్షుడు దత్తాత్రేయరావు, ఏఎంసీ డైరెక్టర్ పెద్దబోయిన శంకర్, కో ఆప్షన్ సభ్యుడు రహ్మత్ఖాన్, జడ్పీ మాజీ చైర్మన్ పురుషోత్తంగౌడ్, మాజీ జడ్పీటీసీ మంగపతి సురేశ్బాబు, బీఆర్ఎస్ నాయకులు పెర్క రాజన్న, ముస్కె సాగర్, శివకృష్ణ, మైనార్టీ సంఘం మండల అధ్యక్షుడు ఎండీ గౌస్, మైనార్టీ నాయకులు అబుసాదు, రవూఫ్ఖాన్, ఎండీ జావీద్, ఎండీ సర్వర్, సజ్జీఖాన్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.
చీరల పంపిణీ
బెల్లంపల్లి, ఏప్రిల్ 17 : మాజీ కౌన్సిలర్ షేక్ యూసుఫ్ జ్ఞాపకార్థం అని భార్య కౌన్సిలర్ షేక్ ఆస్మా, కుటుంబ సభ్యులు సోమవారం చీరెలు పంపిణీ చేశారు. గోల్బంగ్లా బస్తీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 300 మంది మహిళలకు చీరెలు అందజేశారు. యూసుఫ్తో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.