ఆదిలాబాద్ : కాలానుగుణంగా వచ్చే వ్యాధులను నియంత్రించడాని క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ధన్రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ఆరోగ్య సహాయకులకు వివిధ ఆరోగ్య కార్యక్రమాల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంక్రమిక వ్యాధుల గురించి ప్రజలను స్క్రీనింగ్ చేసి వ్యాధులన్న వారిని గుర్తించి వెంటనే చికిత్స అందించాలన్నారు.
అలాగే వెంటనే సంబంధిత వ్యాధి గ్రస్తుల సమాచారాన్ని ఆన్లైన్లో ఎన్సీడీ పోర్టల్ లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. దీంతో హైపర్ టెన్షన్ (B.P) మధుమేహం (డయాబెటిస్)వల్ల వచ్చే ఇబ్బందులను తగ్గించ వచ్చునని, ఆరోగ్యకర అలవాట్లను పాటించే విధంగా వారికి అవగాహన కల్పించాలని తెలిపారు.
18 సంవత్సరాల పై బడిన వారందరు కొవిడ్ టీకా మొదటి, రెండో డోసు తీసుకునే విధంగా పక్కా ప్రణాళిక తో ముందుకెళ్లి వందశాతం లబ్దిదారులు టీకాలు పొందేవిధంగా చూడాలని కోరారు.
సమావేశంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అవినాష్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ ఆశిష్ రెడ్డి, డాక్టర్ కిరణ్మయి, డిప్యూటీ జిల్లా మాస్ మీడియా అధికారి బారె రవీందర్, ఆరోగ్య పర్య వేక్షకురాలు విమల తదితరులు పాల్గొన్నారు.