బాసర, మార్చి 12 : బాసర ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉదయం గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయం లో అమ్మ వారిని దర్శించుకొని మొక్కులు తీర్చు కున్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా మహా రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి అమ్మ వారిని దర్శించు కోవడానికి భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
ఎమ్మెల్యే జోగు రామన్న పూజలు
సరస్వతీ అమ్మ వారిని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కుటుంబ సభ్యులతో కలిసి దర్శిం చుకున్నారు. ఉదయం అభిషేక సేవలో పూజలు చేసిన అనంతరం తన మనువరాలు మహికకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు. అనంతరం అర్చకులు ఆయనను శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అతిథి గృహంలో ఎమ్మెల్యే జోగు రామన్నను బాసర బీఆర్ఎస్ నాయకులతో కలిసి సన్మానించారు.
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పూజలు..
సరస్వతీ అమ్మ వారిని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కుటుంబ సభ్యులతో కలిసి దర్శించు కున్నారు. బాసర చేరుకున్న వీరికి ఆలయ అధి కారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసా దాలు అందజేశారు. అనంతరం ద్వారక తిరుమల అతిథి గృహంలో తెలంగాణ రజక సంఘం సమితి రాష్ట్ర కోకన్వీనర్ సుంకెట పోశెట్టి , పాంగ్రా సర్పంచ్ కుమారుడు పోశెట్టి శాలువాతో సన్మా నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సారయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, మాడ్రన్ దోబీఘాట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో 282 కోట్ల నిధుల తో 141 దోబీఘాట్లు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 12 దోబీఘాట్లను మంజూరు చేసినం దుకు గానూ సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్సీ కృతజ్ఞతలు తెలిపారు.
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
మండలంలోని కిర్గుల్ (బీ) గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి కృషి చేస్తున్నదని, నాణ్యతతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కాంట్రా క్టర్ను ఆదేశించారు. సర్పంచ్ సుధాకర్ రెడ్డి, నాయకులు బాశెట్టి రాజన్న, భైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణ పాల్గొన్నారు.