ఎదులాపురం, డిసెంబర్ 23 : పాడి పశువుల కొనుగోలుకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని, విజయ డెయిరీకి పాలు పోసి వివిధ ప్రయోజనాలు పొందాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్రావు అన్నారు. ఆదిలాబాద్లోని విజయ డెయిరీ కార్యాలయంలో శుక్రవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా డెయిరీ మేనేజర్ దస్రునాయక్ మాట్లాడుతూ నాణ్యమైన పాలకు మంచి ధర లభిస్తుందన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ భాస్కర్ప్రసాద్ మాట్లాడుతూ ఎస్బీఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, తదితర బ్యాంకులు అర్హత గల వారికి రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మ భూషణ్ రాజు, జిల్లా పశువైద్యాధికారి రాథోడ్ కిషన్, డిస్ట్రిబ్యూటర్ నరేందర్, జిల్లా పాడి రైతులు, విజయ డెయిరీ సిబ్బంది, గోపాల మిత్రలు పాల్గొన్నారు.