నిర్మల్ అర్బన్, ఆగస్టు 10 : తెలంగాణ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం మంత్రి సమక్షంలో లక్ష్మణచాంద మండలం చింతల్చాంద గ్రామానికి చెందిన 25 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసిస్తలేరని, అన్ని నియోజక వర్గాల్లో కార్యకర్తల వలసలు కొనసాగుతున్నాయన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు సరైన గుర్తింపు దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషిచేయాలని, మరోసారి సీఎం కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి అల్లోల సురేందర్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, ఎంపీపీ అడ్వాల రమేశ్, నరేశ్ రెడ్డి, సురేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పారీట పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, కోటగిరి అశోక్, అడ్ప పోశెట్టి, గోపు గోపినాథ్ పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు..
దిలావర్పూర్, ఆగస్టు 10 : సిర్గాపూర్ గ్రామంలోని రుక్మారెడ్డి గార్డెన్లో దిలావర్పూర్ మండలానికి చెందిన 56 మందికి, నర్సాపూర్(జీ) మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి అల్లోల పంపిణీ చేశారు. అక్కడే బోదకాలు నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే దిలావర్పూర్ గ్రామానికి చెందిన రైతుకు పోడు భూమి పాస్బుక్కును అందించారు.
కాల్వనృసింహుడి ఆలయ పాలకవర్గ ప్రమాణస్వీకారం
ప్రసిద్ధ కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన పాలకవర్గంతో దేవదాయ శాఖ ఈవో రవికిషన్గౌడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అల్లోల పాల్గొన్నారు. అనంతరం ఆలయ చైర్మన్గా కాల్వ గ్రామానికి చెందిన పూజారం మహేశ్ను ఎన్నుకున్నారు. డైరెక్టర్లుగా జీ నర్సయ్య, ఏ ప్రీతంరెడ్డి, డీ మహేశ్, పీ శ్రీనివాస్రెడ్డి, ఏ విమల, పూదరి శివకుమార్, ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఆర్ రాములు ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి మంత్రి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయం వద్ద రూ.2.25 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. నృసింహుడి కల్యాణ మండపం కోసం మరో రూ.కోటి, అలాగే ఆలయ సమీపంలోని కోనేరు మరమ్మతుల కోసం రూ.15 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గంగారెడ్డి, ఆడెపు తిరుమలశ్రీనివాస్, ఎంపీపీ అక్షర, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల చిన్నదేవేందర్రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సుభాష్రావు, రైతు సేవా సహకార సంఘం మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, నర్సాపూర్(జీ) జడ్పీటీసీ రామయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్దే అనీల్, ఓడ్నం కృష్ణ, స్వామిగౌడ్, బాబురావు, అలోల మురళీధర్రెడ్డి, గౌతమ్రెడ్డి, దనే రవి, సప్పల రవి, గంగారెడ్డి, భోజారెడ్డి, గుణవంతురావు, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో మోహన్, డాక్టర్ శ్యామ్కుమార్, ఆర్ఐ సంతోష్కుమార్, దేవాదాయశాఖ ఈవో రవికిషన్గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మామడలో..
మామడ, ఆగస్టు 10 : మామడ రైతు వేదికలో మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హన్మాగౌడ్, వైస్ ఎంపీపీ లింగారెడ్డి,బిఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్గౌడ్,రైతు బంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్ల లింగారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సంతోష్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు భూమేశ్వర్, సర్పంచులు ముత్యంరెడ్డి, గంగాధర్, రాందాస్, అరవింద్రావు, నాయకులు వికాస్రెడ్డి, మేకం అశోక్, సాగర్, రఘ, రత్నయ్య, శ్రీనివాస్గౌడ్, శశికాంత్రెడ్డి, భాస్కర్రావు తదితరులున్నారు.