ఆసిఫాబాద్ టౌన్,డిసెంబర్ 01: కాంగ్రెస్ పాలనలో విద్యా సంస్థలు ఆగమయ్యాయని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జి ముస్తఫాతో కలిసి ఆదివారం జిల్లా కేంద్రంలోని పీటీజీ గురుకుల పాఠశాలను సందర్శించారు. వంటశాల పరిసరాలతో పాటు భోజనం, కూర, మెనూ ను పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎకడా ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటనలు లేవన్నారు. అనంతరం విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, నాయకులు సాయి శ్రావణ్, శ్రీకాంత్, తాజ్, అరుణ్, ప్రవీణ్, రామ్ శేఖర్ పాల్గొన్నారు.