రెబ్బెన, జనవరి 17: బెల్లంపల్లి ఏరియా లోని టీబీజీకేఎస్ కార్యకర్తలు, కార్మికులకు అండగా ఉంటానని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గోలేటిటౌన్షిప్లోని టీబీజీకేఎస్ కార్యాలయంలో బుధవారం రాత్రి యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికల్లో యూనియన్ నిర్ణయం ప్రకారం పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులు కల్పించారని గుర్తు చేశారు.
టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ నాయకుడు ధరావత్ మంగీలాల్, ఏరియా కమిటీ నాయకులు గజ్జెల్లి చంద్రశేఖర్, మాంతు సమ్మయ్య, మారిన వెంకటేశ్వర్లు, అలవేణి సంపత్, మాజీ ఉపాధ్యక్షుడు నల్లగొండ సదాశివ్, ఖైర్గూడ పిట్ కార్యదర్శి కార్నాథం వెంకటేశం, సీహెచ్పీ పిట్ కార్యదర్శి మెరుగు రమేశ్, వర్క్షాప్ పిట్ కార్యదర్శి రాజేశం, ఏరియా అసుపత్రి పిట్ కార్యదర్శి అనుముల సత్యనారాయణ, సివిల్ డిపార్టుమెంట్ పిట్ కార్యదర్శులు శ్రీనివాస్, విజ్జన్న, జీఎం కార్యాలయ అసిస్టెంట్ పిట్ కార్యదర్శి మంకయ్య, స్టోర్స్ పిట్ కార్యదర్శి రమేశ్, మహిళ నాయకురాళ్లు వరలక్ష్మి, భాగ్యలక్ష్మి, తదితరులున్నారు.