లింగాపూర్,జనవరి 31: ప్రజా పాలనా సౌలభ్యం కోసమే కొత్త జీపీ భవనాలను ప్రారంభిస్తున్నట్లు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని కంచన్పల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన జీపీ భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా పాత భవనాల్లో నడుస్తున్న పంచాయతీ కార్యాలయాలకు గత కేసీఆర్ ప్రభుత్వం కొత్తవి మంజూరు చేసిందన్నారు. పదవీకాలం ముగిసిన సర్పంచ్ కనక జ్యోతిరాంను శాలువాతో సన్మానించారు.
ముళ్లగూడ గ్రామాన్ని సందర్శించారు. ఆదర్శ అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ అడె సవిత, జడ్పీటీసీ రక్కాబాయి, వైస్ ఎంపీపీ ఆడె ఆత్మారాం, ఎంపీడీవో జోయల్ ప్రసాద్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆత్రం అనిల్ కుమార్, కో ఆప్షన్ సభ్యుడు సలీం, సీడీపీవో ఇంద్రావతి, సూపర్ వైజర్ లైలా, ఉన్నారు.
జైనూర్, జనవరి 31: మండలంలోని వ్యవసాయ శాఖ సహకార సంఘం ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్నిజైనూర్ మార్కెట్ గోదాంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రారంభించారు. రైతులు పండించిన కందులను నేరుగా ఈ కేంద్రంలోనే అమ్ముకోవాలని సూచించారు. ఎంపీడీవో ప్రభుదయా, ఎంపీపీ కుమ్ర తిరుమల విశ్వనాథ్, వైస్ ఎంపీపీ చెర్లె లక్ష్మణ్, సహకార సంఘం చైర్మన్ కోడప హన్నూ పటేల్, ఏవో పవన్ కుమార్, మాజీ సర్పంచ్ మెస్రం పార్వతీలక్ష్మణ్, రాహుల్, మడావి భీంరావ్, పెందోర్ లక్ష్మణ్, ఉప సర్పంచ్ అబ్బు, సీఈవో జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.