జైనూర్, ఫిబ్రవరి 26 : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి కల్యాణ లక్ష్మి చెకులను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పేద యువతుల పెళ్లిళ్లకు అండగా నిలిచేందుకు కల్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొమర తిరుమల విశ్వనాథ్, వైస్ ఎంపీపీ చీరలే లక్ష్మణ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇంతియాజ్లాల, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కుముర భగవాన్ రావు, మాజీ సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.