ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
23మంది లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ
నార్నూర్,మే17: ప్రతి దళిత కుటుంబంలో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. దళితబంధు పథకం కింద ఉమ్మడి మండలంలోని గంగాపూర్, ఖడ్కి ఎస్సీగూడలోని పలువురికి మంజూరైన యూనిట్లను జడ్పీ చైర్మన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కలిసి మంగళవారం పంపిణీ చేశారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల్పరించారు.
స్థానికులు ఘన స్వాగతం పలికి, సన్మానించారు. యూనిట్లకు సంబంధించిన ప్రొసీడింగ్లతో పాటు వాహనాలకు సంబంధించిన కీలను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని చెప్పారు. ఉమ్మడి మండలంలో 23మందిని ఈ పథకానికి ఎంపిక చేసినట్లు వివరించారు. దళితబంధు పథకంతో లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీలు కనక మోతుబాయి, ఆడ చంద్రకళ, వైస్ ఎంపీపీలు జాదవ్ చంద్రశేఖర్, మర్శివనే యోగేశ్, ఈడీ శంకర్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి రంగరావ్, ఇండస్ట్రీస్ మేనేజర్ రాజు, సర్పంచ్లు యుర్వేత రూప్దేవ్, మడావి సీతాబాయి, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ తొడసం నాగోరావ్, తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్, ఆర్కా మోతీరామ్, ఎంపీడీవోలు రమేశ్, రామేశ్వర్, ఎంపీవోలు షేక్ ఖలీం హైమద్, స్వప్నశీల, ఏపీఎంలు రమేశ్, మాధవి, నాయకులు,కార్యకర్తలు, అధికారులు ఉన్నారు.