బెజ్జూర్, ఆగస్టు 29 : తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ ద్వారా ప్రతి ఇంటికీ రూ.2 వేలు అందించి ఆదుకుంటున్నదని, మళ్లీ టీఆర్ఎస్కేపట్టం కట్టాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప పేర్కొన్నారు. సోమవారం బెజ్జూర్ మండల కేంద్రంతో పాటు సులుగుపల్లి, సలుగుపల్లిలో కొత్తగా మంజూరైన పింఛన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోనప్ప అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెజ్జూర్ గ్రామంలోనే సుమారు 2 వేల మందికి పింఛన్లు మంజూరు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దరఖాస్తుల్లో తప్పులు దొర్లి ఉంటే ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు ఆయన సూచించారు. ఇలాంటి సంక్షేమ పథకాలు పొరుగున్న మహారాష్ట్రలో కనిపించవని, వివిధ సంక్షేమ పథకాలతో సబ్బండ వర్గాల వారిని సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని కొనియడారు. అనంతరం పింఛన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ డోకె రోజారమణి, జడ్పీటీసీ పంద్రం పుష్పలత, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ కోండ్ర జగ్గాగౌడ్, సర్పంచ్ కొట్రంగి శారద, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సిడాం సకారాం, సహకార సంఘం మాజీ చైర్మన్ డోకె వెంకన్న, కో-ఆప్షన్ సభ్యుడు బషారత్ ఖాన్, ఎంపీటీసీలు పర్వీన్ సుల్తానా, కొడ్పల లక్ష్మి, సర్పంచ్ కాటెల అంజలి, నాయకులు జావీద్ అలీఖాన్, కోండ్ర నరేందర్ గౌడ్, జాహిద్ హుస్సేన్, చిప్పకుర్తి దేవాజీ, కొట్రంగి రామకృష్ణ, తంగెడిపల్లి మహేశ్, కొట్రంగి భీమన్న, కార్యదర్శి పోశాలు తదితరులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి మండలంలో..
చింతలమానేపల్లి మండలంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పర్యటించారు. రుద్రాపూర్ రైతు వేదికలో రుద్రాపూర్, ఏటిగూడగ్రామాల్లోని లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను అందజేశారు. అనంతరం కర్జెల్లిలో 80 మందికి కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల అర్హులైన వారికి ఆసరా పింఛన్ కార్డులను అందజేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఉచిత వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డుబ్బుల నానయ్య, కో ఆప్షన్ సభ్యుడు నాజీం హుస్సేన్ , కాగజ్నగర్ మార్కెట్ వైస్ చైర్మన్ డోకె రాజన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డుబ్బుల వెంకయ్య, సర్పంచ్లు చౌదరి నానయ్య, కార్యదర్శులు కైలాస్, రవీందర్, నాయకులు భీంకరి నారాయణ, రంగయ్య, సత్యనారాయణ, భీంకరి హన్మంతు, నాయకులు పాల్గొన్నారు.
కౌటాల మండలంలో..
కౌటాల, ఆగస్టు 29 : దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను తెలంగాణ సర్కారు అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని కౌటాలలో 138, తలోడిలో 46, ముత్తంపేటలో 131 మందికి ఆసరా పింఛన్ కార్డులను అందజేశారు. 57 సంవత్సరాలు నిండిన వారితో పాటు, ఒంటరి మహిళలు, బీడీ పరిశ్రమ కార్మికులు, చేనేత కార్మికులు, గౌడ కార్మికులకు పింఛన్లను అందించి సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీలు బసార్కర్ విశ్వనాథ్, డుబ్బుల నానయ్య, సర్పంచ్లు మౌనిశ్, శంకరమ్మ, శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యుడు అజ్మత్ అలీ, ఉపాధ్యక్షుడు తిరుపతి, వెంకటేశ్, పార్టీ అధ్యక్షులు వసంత్ రావు, వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.