దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా చెరువుల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలతో కలిసి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో ర్యాలీలు తీశారు. ప్రజలు గంగమ్మ, మైసమ్మ, కట్ట మైసమ్మ తల్లులకు పూజలు చేశారు. కొన్ని చోట్ల బోనాలు, మరికొన్ని చోట్ల బతుకమ్మలతో డప్పుచప్పుళ్ల నడుమ మహిళలు తరలివెళ్లారు.
నిర్మల్ మండలంలోని వెంగ్వాపేట్ చెరువు వద్ద మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డి, ఎస్ఈ సుశీల్కుమార్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అలాగే ప్రజలకు చేపల ఆహార ఉత్పత్తులు, వాటి పోషక విలువలు, రుచులను పరిచయం చేసేందుకు ‘ఫిష్ ఫెస్ట్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మూడ్రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో వివిధ రకాల రుచులను పరిచయం చేయనున్నారు. కాగా, రెండు జిల్లాల పరిధిలో మంత్రి అల్లోల, ఎమ్మెల్యేలు ఫుడ్ స్టాళ్లను ప్రారంభించారు.