ఆసిఫాబాద్ టౌన్,మార్చి 14 : జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక ఈ నెల 15న ప్రారంభించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ భవనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీతో కలిసి పరిశీలించారు. ఇంకా ఏవైనా పనులు మిగిలి ఉంటే వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ పీడీ సురేందర్, ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, ఇంజినీరింగ్, గ్రంథాలయ అధికారులు ఉన్నారు.