జై నూర్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జై నూర్ మండల కేంద్రంలో శనివారం 10వ తరగతి పరీక్షలు( Tenth Exams ) సాఫీగా సాగాయి. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 209 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా , ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో 270 విద్యార్థులు పరీక్షలు రాసినట్లు పరీక్షల అధికారులు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు విధించారు.
పరీక్ష కేంద్రాల సమీపంలో 100 మీటర్ల పరిధిలో ఉన్న ఫోటో కాపీ జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కేంద్రాలను మూసి ఉంచేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాలలో మౌలిక వసతులు మరుగుదొడ్లు మంచినీటి వసతి, ఆరోగ్య సిబ్బందిని నియమించారు.