ఆదిలాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారానే తమకు జాతీయస్థాయి అవార్డు వచ్చిందని జిల్లాలోని ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామస్తులు అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామంలో చెత్త సేకరణ, సేంద్రియ ఎరువుల తయారీ చేస్తూ ఆదాయం పొందుతున్నట్లు గ్రామ సర్పంచ్ మీనాక్షి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల గ్రామంలోని 232 కుటుంబాలకు రూ.33 కోట్లతో లబ్ధి చేకూరిందని సర్పంచ్ పేర్కొన్నారు.