బజార్హత్నూర్, సెప్టెంబర్ 22 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మండలంలోని గులాబ్తండా, ఎస్సాపూర్ గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో గడపగడపకూ తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలను పొందుతున్నదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి సీఎం కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు. ప్రజల అండదండలతో రానున్న ఎన్నికల్లో తమ ఆశీస్సులు అందిస్తే నియోజకవర్గ ఆభివృద్ధికి మరింత కృషిచేస్తానని కోరారు. అంతకు ముందు గులాబ్తండా, ఎస్సాపూర్ గ్రామాల్లో కొలువుదీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ ఎంపీపీ ప్రీతంరెడ్డి, గులాబ్తండా సర్పంచ్ విద్యాసాగర్, నాయకులు మడిగే రమేశ్, ఉత్తం, అక్షయ్, గణేశ్, నందు, చందర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని మల్యాల, తలమద్రి గ్రామాల్లో అనిల్ జాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో గ్రామాలు ప్రగతి పథంలో నడుస్తున్నాయనానరు. ఆయన వెంట సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పాండురంగ్, సర్పంచ్ చిన్నయ్య, ఉప సర్పంచ్ సుమన్, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, రమేశ్ నర్వాడే, అబ్దుల్ సాబీర్, కరీం, శివ, గ్రామస్తులు పాల్గొన్నారు.