నార్నూర్,ఫిబ్రవరి17:సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు న్యూట్రీషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ఎన్నో పథకాల కు రూపకల్పన చేసి అమలులోకి తీసుకొస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రూ.2వేల విలువైన న్యూట్రీషన్ను కిట్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, నార్నూర్ పీఏసీఎస్ ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్, సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, డైరెక్టర్ దుర్గే కాంతారావు, కోఆప్షన్ సభ్యుడు షేక్ దస్తగిరి, ఖైరదట్వా సర్పంచ్ కనక సేవంత, పట్టణాధ్యక్షుడు ఫిరోజ్ఖాన్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాసిం,హెచ్ఈవో చౌహాన్ నాందేవ్, నాయకులు రాథోడ్ ఉత్తమ్, రాథోడ్ రమేశ్, రాథోడ్ సుభాష్, షేక్ దాదేఅలీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.