నిర్మల్ టౌన్, మార్చి 8 : ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ. 1,01,116 ఆర్థిక సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు అండగా ఉండా లని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవా దాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొ న్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబే ద్కర్ భవన్లో బుధవారం నిర్మల్ పట్టణంతో పాటు వివిధ మండలాలకు చెందిన 279 మంది లబ్ధిదా రులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులను జిల్లా కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడ పిల్లల పెళ్లిళ్లు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకు అండగా ఉండేందుకే షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చిలుక రమణ, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బోండ్ల గంగాధర్, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్లు సుభాష్ చందర్, ప్రభాకర్, బీఆర్ఎస్ పట్టణా ధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిర్మల్ చైన్గేట్, మార్చి 8 : మహిళల సంక్షే మానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి పేర్కొన్నారు. నిర్మల్లోని దివ్య గార్డెన్లో బుధ వారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఈ సదస్సుకు మంత్రి హాజరై మాట్లా డారు. మహిళలకు గౌరవం కల్పించాలనే ఉద్దేశం తో సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడు తున్నారని పేర్కొన్నారు. మహిళల రక్షణకు షీటీం, సఖీ వంటి కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింద న్నారు. బాలికల విద్యకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదన్నారు. స్వయం సహాయక సంఘా లకు స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా రుణ సౌక ర్యం కల్పిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న లక్ష్మిని సన్మానించారు. వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళా అధికారులు, ఉద్యోగులకు, అవార్డులం దించారు. ఉన్నత స్థానంలో నిలిచిన మహిళా ఉద్యోగులు, కౌన్సిలర్లను మంత్రి సన్మా నించారు. జిల్లా కలెక్టర్ వరుణ్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో స్రవంతి, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, డీఆర్డీవో విజయలక్ష్మి, కౌన్సిలర్లు, పలు శాఖల అధికారు లు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, మార్చి 8 : త్వరలోనే నిర్మల్ జిల్లా కేంద్రానికి సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యం లో తెలంగాణ (బీఆర్ఎస్) భవన్ను సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను ఆదేశించారు. నిర్మల్ పట్టణ శివా రు సమీపంలో ఉన్న తెలంగాణ భవన్ను మంత్రి సందర్శించారు. తెలంగాణ భవన్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం, జెండా దిమ్మెను ఏర్పా టు చేయాలని సూచిం చారు. భవనానికి రంగులు వేసి ముస్తాబు చేయాలన్నారు. కొత్తగా నిర్మించి న కలెక్టరేట్ భవన సముదాయం, తెలంగాణ భవన్ ప్రారంభం, మెడికల్ కాలేజ్ నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారని తెలిపారు. దీనికి సంబంధించి త్వర లోనే పర్యటన ఖరారు కానుందని మంత్రి చెప్పారు.