మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు
మంచిర్యాలటౌన్, జూన్ 5: పట్టణ ప్రగతి కార్యక్రమంతో అన్నివార్డులు అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నాయని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 3, 4, 12 వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కమిషనర్ బాలకృష్ణ, కౌన్సిలర్లతో కలిసి ఆదివారం పర్యటించారు. వా ర్డుల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా నిధులు మంజూరు చేస్తుందని, వాటితో మౌ లిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆసిఫాబాద్లో జడ్పీచైర్పర్సన్ పర్యటన..
ఆసిఫాబాద్, జూన్ 5 : జిల్లాకేంద్రంలోని బెస్తావాడ, బానర్వాడ, మేకలవాడలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి ఆదివారం పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బానర్వాడలో రెండు విద్యుత్ మోటర్లు బిగించి తాగునీటిని అందించాలని ఈవోకు సూచించారు. బెస్తావాడలో మిషన్భగీరథ నీరు రావడం లేదని కాలనీ వాసులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఆమె స్పందిస్తూ సంబంధిత అధికారికి ఫోన్ చేసి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ. 20 లక్షలు కేటాయిస్తామని, పంచాయతీరాజ్ ఏఈ రాంకిరణ్కు ఫోన్ చేసి అందుకు సంబంధించి అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ గంధం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి వంశీకృష్ణ, సిబ్బంది సంతోష్, వంశీ, టీఆర్ఎస్ నాయకుడు సాయి ఉన్నారు.
వాంకిడి మండలంలో..
వాంకిడి, జూన్ 5 : మండలంలోని ఖమానా, జముల్ ధరి, ఖైరీ ట్, లంజన్వీర, వెల్గి, సర్కపల్లి, లక్ష్మీపూర్ గ్రామాల్లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఖమానాలోని కాలనీల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముండే విమలాబాయి, జడ్పీటీసీ అజయ్ కుమార్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు రెడ్డి, ఎంపీవో శివ కుమార్, సింగిల్ విండో చైర్మన్ జబోరే పెంటయ్య, ఖమానా ఎంపీటీసీ హీవ్రే ప్రవీణ్, మాజీ బంబార ఎంపీటీసీ పీ వినోద్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి సదాశివ్, సర్పంచ్లు అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
తిర్యాణి మండలంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ..
తిర్యాణి, జూన్ 5 : గడలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు పల్లెప్రగతిలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామాల్లో సమస్యలను సర్పంచ్ మడావి గుణవంతరావును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీవో జావె ద్, ఏదులపాడ్ సర్పంచ్ మడావి గోపాల్, గిన్నెధరి బీపీఎం స త్యం, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు.