మంచిర్యాలటౌన్, మార్చి 3 : ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం ఉదయం మంచిర్యాలలోని ఎంసీహెచ్లో శిశువుకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పట్టణాలు, గ్రామాల్లో దవాఖానలు, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రదేశాలు, రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలియో రహిత సమాజ స్థాపన కోసం అందరూ కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుబ్బారాయుడు, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అనిత, ఎంసీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ భీష్మ, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నీరజ, వైద్యులు ముస్తాఫా, ప్రశాంతి, అరుణశ్రీ, వైద్య సిబ్బంది నాందేవ్, అల్లాడి శ్రీనివాస్, బుక్య వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.