మందమర్రి, మార్చి 3: ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రజలకు సూచించారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ ఏరియాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రపంచ వ్యాప్తంగా పోలియో అంటే పెద్ద వ్యాధిగా భావించి ప్రజలు భయపడేవారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి ఫలితంగా పోలియో మహమ్మారి అంతమైందని చెప్పారు. రెండు రోజుల పాటు ఇంటింటికీ వైద్య సిబ్బంది వచ్చి పోలియో చుక్కలు వేస్తారని ప్రజలు వారికి సహకరించాలని తెలిపారు.
గృహజ్యోతి పథకం ప్రారంభం.. మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు శాంతినగర్లో గృహజ్యోతి పథకాన్ని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నదని, అందులో భాగంగానే గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి రమేశ్, సీహెచ్వో గంగాధర్, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, సీనియర్ కాంగ్రెస్ నాయకుల సొతుకు సుదర్శన్, బండి సదానందం, నోముల ఉపేందర్ గౌడ్, గుడ్ల రమేశ్, మహంత్ అర్జున్,వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
దండేపల్లి, మార్చి3: దండేపల్లి మండల కేంద్రంలో పల్స్పోలియో కార్యక్రమాన్ని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, జడ్పీటీసీ గడ్డం నాగరాణి, వైద్యాధికారి సతీశ్కుమార్, ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, తాళ్లపేట పీహెచ్సీ పరిధిలో గల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంపీటీసీ కంది హేమలత, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, వైద్యాధికారి క్రాంతి కుమార్ పాల్గొని ప్రారంభించారు. వైద్య సిబ్బందితో పాటు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి, తాళ్లపేట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
హాజీపూర్, మార్చి 3 : రాపల్లి గ్రామంలో చిన్నారులకు పొలియో చుక్కలను ఎంపీపీ మందపెల్లి స్వర్ణలత కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్ని గ్రామాల్లో పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
మండలంలో 88 శాతం పూర్తి..హాజీపూర్ మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం 88 శాతం పూర్తయినట్లు పీహెచ్సీ వైద్యురాలు లహరి తెలిపారు. మండలంలో 1861 మంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలుండగా 1639 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. మిగతా వారికి రెండు రోజుల్లో వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటు ఆశ కార్యకర్తలు, అంగన్ వాడీ వర్కర్లు పాల్గొన్నారు.
చెన్నూర్, మార్చి 3: చెన్నూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ అర్చనాగిల్డా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, మెప్మా, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.
మందమర్రి రూరల్, మార్చి 3: పొన్నారం, వెంకటాపూర్ గ్రామాల్లో చిన్నారులకు జడ్పీటీసీ వేల్పుల రవి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు గ్రామాల్లో క్యాంపులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల హెల్త్ సూపర్వైజర్ గ్లోరి, హరీశ్, సుజాత, రజిత, ఈద లింగయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తాండూర్, మార్చి 3 : తాండూర్లో మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చిన్నారులకు డాక్టర్ కుమారస్వామి పోలియో చుక్కలు వేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పీహెచ్సీ సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొని పోలియో చుక్కల మందు వేశారు. మండల వ్యాప్తంగా మూడు రూట్లు చేశామని, 21 బూత్లు, ఒక మొబైల్ టీం బృందాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. 94 శాతం పూర్తి చేశామని తెలిపారు. రెండు రోజుల్లో వంద శాతం పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, వైద్య, గ్రామపంచాయతీల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్, మార్చి 3: మండలంలో ప్రతి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అంగ్రాజ్పల్లి హెచ్ఈవో జగదీశ్ తెలిపారు. ప్రతి గ్రామంలో తిరిగి పోలియో చుక్కలు వేసుకోని పిల్లలకు వేస్తామని తెలిపారు.
లక్షెట్టిపేట, మార్చి 3: లక్షెట్టిపేట బస్టాండ్లో మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, తిమ్మాపూర్లో జడ్పీటీసీ ముత్తె సత్తయ్య చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలో 4250 మంది ఐదేండ్లలోపు పిల్లలున్నారని, 34 కేంద్రాలను ఏర్పాటు చేశామని వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సతీశ్ తెలిపారు. 90 శాతం పూర్తి చేశామని, మిగిలిన చిన్నారులకు రెండు రోజుల్లో వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయూష్ కేంద్రం వైద్యురాలు శ్రీజ, మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ కల్లెడ రాజశేఖర్, ఎంపీపీ దేవేందర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు, ఆయా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధు లు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్, మార్చి 3: నస్పూర్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో పిల్లలకు వద్ద ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పోలియో చుక్కలు వేశారు. నస్పూ ర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద మున్సిపల్ చైర్మన్ సుర్మిళ్ల వేణు, కమిషనర్ సతీశ్, తదితరులు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సమత, కౌన్సిలర్ సుమతీ మల్లేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
బెల్లంపల్లిరూరల్, మార్చి 3: బెల్లంపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో పల్స్పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
కాసిపేట, మార్చి 3 : కాసిపేట మండలంలో 28 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి, 3137 చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్యాధికారి రవి కిరణ్ తెలిపారు.
జైపూర్, మార్చి 3: మండలంలోని జైపూర్, కుందారం ఆరోగ్య కేంద్రాలలతో పాటు బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, బస్తీ దవాఖానల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా పల్స్ పోలియో కార్యక్రమాన్ని సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైపూర్లో వైద్యులు అనిల్రావు, కుందారం వైద్యురాలు శ్రావ్య, సిబ్బంది పాల్గొన్నారు.
బెల్లంపల్లి, మార్చి 3 :పల్స్ పోలియో కార్యక్రమాన్ని బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా వద్ద చిన్నారికి పోలియో చుక్కలు వేసి షంషీర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి సుచిత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు సౌజన్య, పబ్లిక్ హెల్త్ మేనేజర్ మధు, కమ్యూనిటీ హెల్త్ అధికారి రవీందర్, డీపీఎంయూ రమేశ్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. పట్టణంలోని 34 వార్డుల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.