నార్నూర్, మార్చి 3 : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. శుక్రవారం నార్నూర్లోని గాంధీచౌరస్తాలో కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు సిలిండర్లతో పాటు కట్టెలపొయ్యిపై వంట చేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నదని ధ్వజమెత్తారు. గ్యాస్ ధర ఒకే సారి రూ.50 పెంచడం దారుణమన్నారు. తక్షణమే వంటగ్యాస్ ధరను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ నాగోరావ్, సహకార సంఘం చైర్మన్ సురేశ్, సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్, డైరెక్టర్ కాంతారావ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బోథ్లో..
బోథ్, మార్చి 3 : మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఖాళీ సిలిండర్లతో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎస్ రుక్మాణ్సింగ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, వైస్ఎంపీపీ రాథోడ్ లింబాజీ, నాయకులు అమృత్రావ్, పోశెట్టి, సోమన్న, బుచ్చన్న, రమణాగౌడ్, ప్రవీణ్ పాల్గొన్నారు.
సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి
నేరడిగొండ, మార్చి 3 : బీజేపీ పాలనలో సామాన్యులు బతికే పరిస్థితి లేదని జడ్పీటీసీ జాదవ్ అనిల్ అన్నారు. పెంచిన గ్యాస్ ధరలను వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలోని సర్వీస్ రోడ్డుపై మహిళలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిలిండర్లు పెట్టి ఆందోళన చేపట్టారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్లకార్డులను ప్రదర్శించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ చర్యలతో సామాన్యులపై పెనుభారం పడుతున్నదన్నారు. పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల కడుపుకొడుతున్నదన్నారు. పేదలకు కట్టెలపొయ్యి దిక్కన్నట్లుగా ధరలు పెంచుకుంటుపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ శివారెడ్డి, సర్పంచ్ పెంట వెంకటరమణ, వైస్ఎంపీపీ మహేందర్రెడ్డి, ఉపసర్పంచ్ దేవేందర్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ దావుల భోజన్న, నాయకులు సయ్యద్ జహీర్, రమేశ్, కృష్ణ, నారాయణ, శ్రీనివాస్, తిరుపతి, శేఖర్ పాల్గొన్నారు.
గాదిగూడలో..
నార్నూర్, మార్చి 3 : గాదిగూడలోని కుమ్రం భీం చౌరస్తా వద్ద వైస్ఎంపీపీ యోగేశ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్, ఆత్రం వామన్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్లో..
ఉట్నూర్, మార్చి 3 : కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డివిరుస్తుందని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో గ్యాస్ సిలిండర్లతో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, వైస్ఎంపీపీ బాలాజీ, కోఆప్షన్ సభ్యుడు రషీద్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు అహ్మద్ అజీమ్, నాయకులు సీతారాం, భరత్, పోశన్న, ఆశన్న, బాజీరావ్, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
గ్యాస్ ధరను తగ్గించాలి
ఇంద్రవెల్లి, మార్చి 3 : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని ఎంపీపీ పోటే శోభాబాయి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి డిప్యూటీ తహసీల్దార్ రమేశ్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పెరిగే ధరలకు హద్దులేకుండా పోయిందన్నారు. ధరల పెంపుతో సామాన్యుల పరిస్థితి దిగజారిందన్నారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించే వరకు ఆందోళనలు చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే. జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, బీఆర్ఎస్ మండల కోఆర్డినేటర్ షేక్ సుఫియాన్, పట్టణ అధ్యక్షుడు శ్యామ్, నాయకులు మారుతి, నవాబ్బేగ్, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడలో..
ఇచ్చోడ, మార్చి 3 : మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల కన్వీనర్ మెరాజ్ హమ్మద్, మాజీఎంపీపీ సుభాష్ పటేల్, ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ముస్తఫా, పార్టీ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్, ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ రాథోడ్ ప్రవీణ్, బీసీ సెల్ ప్రెసిడెంట్ గణేశ్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గణేశ్, సోషల్ మీడియా కన్వీనర్ భాస్కర్, నాయకులు రాథోడ్ ప్రకాశ్, గంగయ్య, యూత్ ప్రెసిడెంట్ మహేశ్, శంకర్, రమేశ్ పాల్గొన్నారు.
పేదల కడుపు కొట్టడమే బీజేపీ నైజం
గుడిహత్నూర్, మార్చి 3 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలను దోచి పెద్దలకు పంచుతున్నదని, అదానీ, అంబానీలకు ప్రజల డబ్బును పంచేందుకు సిలిండర్ ధరలు పెంచుతున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ గుడిహత్నూర్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్, సర్పంచ్ జాదవ్ సునీత, మాజీ ఎంపీపీ సత్యరాజ్, ప్రకాశ్, సంతోష్గౌడ్, జంగు, గ్రామాల సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.
భీంపూర్లో..
భీంపూర్, మార్చి 3 : మండలకేంద్రంలో రెండో రోజు శుక్రవారం గ్యాస్ సిలిండర్ ధర పెంపునకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, వైస్ఎంపీపీ గడ్డం లస్మన్న, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, సర్పంచ్లు మడావి లింబాజీ, పెండెపు కృష్ణ యాదవ్, నాయకులు ముకుంద్, జాదవ్ రవీందర్, లక్ష్మీబాయి, భీంబాయి పాల్గొన్నారు.
తాంసిలో..
భీంపూర్, మార్చి 3 : గ్యాస్ ధర పెంపు పేదలకు గుదిబండలా మారిందని జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి రాజు అన్నారు. తాంసిలో ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు ఆందోళన చేపట్టారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్, ప్రధాన కార్యదర్శి రమణ, సర్పంచ్ స్వప్న, నాయకులు కృష్ణ, నాగారెడ్డి, గంగారాం, కంది గోవర్ధన్ రెడ్డి, పీఏసీఎస్ వైస్చైర్మన్ ధనంజయ్, గజానన్, గంగారాం, పరమేశ్వర్, లక్ష్మి, గంగమ్మ పాల్గొన్నారు.
సుంకిడిలో..
తలమడుగు, మార్చి 3 : మండలంలోని సుంకిడి అంతర్ రాష్ట్ర రహదారిపై బీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను నిరసిస్తూ సిలిండర్లతో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధి కిరణ్, మండల కన్వీనర్ తోట వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ వెల్మ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కాటిపల్లి శ్రీనివాస రెడ్డి, మగ్గిడి ప్రకాశ్, లక్ష్మణ్, పొచ్చన్న పాల్గొన్నారు.
జైనథ్లో..
ఎదులాపురం(జైనథ్), మార్చి 3 : వంట గ్యాస్ పెరుగుదలకు వ్యతిరేకంగా జైనథ్లో ఎంపీపీ గోవర్ధన్, మహిళ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తుమ్మల అరుంధతి , మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వర్ష, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి , రైతు బంధు సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్లు బాలురి గోవర్ధన్ రెడ్డి, రమేశ్, వెంకట్ రెడ్డి, గణేశ్ యాదవ్, సర్పంచ్లు దేవన్న, జగదీశ్రెడ్డి, మార్కెట్ కార్యదర్శి మధుకర్, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుల నిరసన
బోథ్, మార్చి 3: గ్యాస్ సిలిండర్ ధర పెంచడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతరం అటవీ శాఖ రేంజ్ కార్యాలయంలో డిప్యూటీ రేంజ్ అధికారి ప్రమోద్కుమార్, ఎఫ్ఎస్వో సుందర్కు ఎండు పుల్లలు (అడవిలో నుంచి కట్టెలు) తెచ్చుకోవడానికి అనుమతివ్వాలని వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, మండల అధ్యక్షుడు మహేందర్, నాయకులు శేఖర్, రాజశేఖర్, మేర్గు భోజన్న, అనిల్, చందు, వేణుగోపాల్రెడ్డి, సంజీవ్, పవన్, రమేశ్ పాల్గొన్నారు.
సీపీఐ నాయకులు నిరసన
ఆదిలాబాద్ టౌన్, మార్చి 3 : కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధర రూ.50 పెంచడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీపీఐ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఖాళీ వంట గ్యాస్ సిలిండర్ను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర నాయకులు నళినిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.