తాంసి, జూన్ 6 : నేటి బాలలే రేపటి భారతదేశ నిర్మాణ శిల్పులని, భవిష్యత్ భారతదేశం బాలల చేతుల్లోనే ఉందని, వారి సమగ్ర అభివృద్ధి ద్వారానే దేశం పురోగతి సాధిస్తున్నదని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బాలల సమస్యలను తెలుసుకొని పరిషరించేందుకు బాల పంచాయతీలు సమర్థవంతమైన వేదికగా నిలుస్తాయని పేరొన్నారు. కప్పర్ల గ్రామంలో నిర్వహించిన బాల పంచాయతీలో పాల్గొన్నారు. బాలబాలికలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాలల హకుల రక్షణ, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, భద్రత ప్రతి ఒకరి బాధ్యత అన్నారు. పిల్లలు నిర్భయంగా తమ సమస్యలను వెల్లడించాలని, వాటి పరిషారానికి అధికారులు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ వంటి సమస్యలపై అవగాహన పెంపొందించడం అవసరమని పేరొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.మౌనిక, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఈవో మాధవి, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, డీసీపీవో రాజేంద్ర ప్రసాద్, ష్యూర్ ఎన్జీవో కో-ఆర్డినేటర్ వినోద్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, ఉమెన్ సేఫ్టీ వింగ్ సీఐ దాసు, కప్పర్ల సర్పంచ్ అరుణ్, ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా, ఎస్ఐ జీవన్రెడ్డి పాల్గొన్నారు.