ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 21 : మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ రేణుక మాత మందిరం సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేశారు. ఇందులో ఏడుగురుని పట్టుకున్నట్లు, వారి నుంచి రూ.రూ.1,12,820 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సయ్యద్ ఇసాక్ తెలిపారు.
దామోదర్ రెడ్డి నివాసంలో అద్దెకు ఉంటున్న గదిలో నిర్వాహకుడు సాజిద్ హుస్సేన్ పలువురితో పేకాట నిర్వహిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రమౌలి, ఎస్ఐ ఇసాక్ ఆధ్వర్యంలో పోలీస్ దాడిచేశారు. సాజిద్ హుస్సేన్, విజయ్కుమార్, నియాజొద్దీన్, కే దామోదర్ రెడ్డి, ముండ నాగనాథ్, ఏ హితేంద్రనాథ్ యాదవ్, సయ్యద్ జాఫర్ అహ్మద్ను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వీరి నుంచి నగదు, కారు, 5 మొబైళ్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.