ఆదిలాబాద్ టౌన్ : ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ , అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్తో కలిసి పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ నుంచి వినాయక్ చౌక్ వరకు రూ.1.5 కోట్ల అంచనాతో బీటీ రోడ్డు , మురికి కాలువలు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు శిశుమందిర్ సమీపంలో భూమి పూజచేసి శిలాఫలకం ఆవిష్కరించి పనులు ప్రారంభించారు. అనంతం రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో పట్టణ నిరాశ్రయుల కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతోనే పల్లె, పట్టణాలు వేగంగా ప్రగతి వైపు పయనిస్తున్నాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ సూపరింటెండెంట్ శిరీషా, కౌన్సిలర్లు , టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.