దహెగాం, మార్చి 26 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎం పీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపే ధ్యేయంగా కష్టపడుదామని ఎమ్మెల్సీ దండె విఠల్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉం టూ సమస్యల పరిష్కారం కోసం పోరాడుదామని, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుదామన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకలు మొక్కవోని దీక్షతో గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ఈ నెల 28న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కాగజ్నగర్కు రానున్నారని, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ నాయకులు ఎల్కరి ప్రశాంత్, షాకీర్, బాలూనాయక్, నాగుల లక్ష్మి పాల్గొన్నారు.