తెలంగాణ సర్కారు ప్రజలకు, రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సామాన్యులకు చేరవేయడానికి వాడుకోవాలని సూచించారు. అనంతరం టీఎస్ఎండీసీ కార్పొషన్ చైర్మన్ క్రిశాంక్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేశ్ పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– ఎదులాపురం, జనవరి 17