బేల, అక్టోబర్21: ప్రతిపక్ష నాయకులు మహిళల ను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారే తప్ప వారి ఆత్మగౌరవానికి పాటు పడడంలేరని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శనివారం రాత్రి మండలంలోని మసాల (బీ) గ్రా మ పరిధిలోని 12 గ్రామాల మహిళలతో కలిసి బ తుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. ఆయనకు మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. సీఎం కేసీఆర్తోనే పండుగలకు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపా రు. అనంతరం బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, మార్కెట్ కమిటీ చైర్మన్ గోడం వర్ష, మహి ళా అధ్యక్ష , కార్యదర్శులు స్వరూపా రాణి, బుడగం మమత, కరుణ , బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్యాం ప్రమోద్ రెడ్డి, వైస్ ఎంపీపీ బండి సుజాత, బీఆర్ఎస్ నాయకులు దేవన్న, సతీశ్పవార్, బండి సుదర్శన్, బత్తుల సుదర్శన్, బండి నందు, విఫిన్ ఖోడే, సునీల్ గోడం, సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.
గుడిహత్నూర్, అక్టోబర్ 21 : మండలకేంద్రంలో ని ప్రైవేట్ జిన్నింగ్ ఫ్యాక్టరీ ఆవరణలో శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ, బోథ్ నియోజక ఇన్చార్జి నగేశ్, బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ హాజరై మాట్లాడారు. గుడిహత్నూర్ పీఏసీఎస్ చైర్మన్ సంజీవ్ ముండే బీజేపీని వీడి ఆయనతో పాటు డైరెక్టర్లు బీఆర్ఎస్లో చేరడంతో కం డువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు శివాలయంలో అనిల్ జాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న కుమ్రం భీం, అంబేద్కర్, చాకలి ఐలమ్మ, అన్నాబావు సాఠే విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి జవహర్నగర్ వరకు బైక్ ర్యాలీ తీశారు.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎంపీ నగేశ్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శు భాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, స్థానిక సర్పంచ్ జాదవ్ సునీత, సర్పంచుల సం ఘం మండలాధ్యక్షుడు తిరుమల్గౌడ్, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ కన్వీనర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.