క్టోబర్27: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు పూర్తయినట్లు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, అభ్యర్థి, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం సాయంత్రం సభ ఏర్పాట్లను బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ తులశ్రీనివాస్తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదిలాబాద్ ప్రజా ఆశీర్వాద సభకు రానున్నరాని తెలిపారు. 10 వేల మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. ర్యాలీ మావల నలంద కళాశాల నుంచి ప్రారంభమై పట్టణంలోని అన్ని చౌక్ల గుండా కొనసాగుతుందని తెలిపారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఇందుకోసం డైట్ మైదానంలో అన్ని ఏర్పాటు పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అలాల్ అజయ్, అశ్రఫ్, నాయకులు సాజీదుద్దీన్, తదితరులున్నారు.
ఉట్నూర్లో..
అక్టోబర్27: ఉట్నూర్కు రాష్ట్ర మంత్రి హరీశ్రావు రానున్న నేపథ్యంలో జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ శుక్రవారం స్థానిక ఎంపీడీవో గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులతో కలిసి మాట్లాడారు. స్టేజీ ఏర్పాటు, వీఐపీ గ్యాలరీ, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇప్పటికే ఆయా పనులు కేటాయించిన వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్రావు, వైస్ ఎంపీపీ బాలాజీ, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, నాయకులు సెడ్మకి సీతారాం, మర్సుకోల తిరుపతి, దావుల రమేశ్, సింగారే భరత్, సలీం, ముజీబ్, రాజేశ్వర్, కాటం రమేశ్, తదితరులున్నారు.