ఎదులాపురం, సెపెంబర్ 1 : పళ్లై నాలుగునెలలు దాటకముందే భార్యపై అనుమానం మొదలైంది. అది ఇల్లాలిని అంతమొందించే దాకా వచ్చింది. తరువాత భయంతో ద్విచక్రవాహనంపై పారిపోయే క్రమంలో రోడ్డు ప్రమాదంలో భర్త కూడా దుర్మరణం చెందాడు. ఈ ఘోర ఉదంతం ఆదిలాబాద్ పట్టణంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్నది. రూరల్ ఇన్చార్జి సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని బంగారిగూడలో నివాసం ఉంటున్న మోహితె జైవంత్, పద్మ కొడుకు మోహితె అరు ణ్ మేస్త్రీ పనిచేసేవాడు.
ఇతనికి నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన చౌహాన్ లక్ష్మి, గోపి దంపతుల కూతురు దీపతో గత మే 5న పెళ్లయింది. పెండ్లయిన కొన్ని రోజులకే అరుణ్కు భార్య దీపపై అనుమానం మొదలైంది. తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగాయి. కాగా, ఇటీవల నాగుల పంచమికి దీప వారి అమ్మగారిళ్లు బాల్కొండకు వెళ్లింది. తన బాధను తల్లి దం డ్రులకు చెప్పుకున్నది. వారు అరుణ్ను పిలి పించి, సము దాయించి ఆగస్టు 29న మెట్టినింటికి పంపించారు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం దీపను ఇంట్లో మంచానికి కొట్టి గొంతునులిమి చంపాడు. అరుణ్ అక్కడి నుంచి బైక్పై పారిపోయాడు. అయితే ఇంటి ఎదుట ఉండే అరుణ్ తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం ఇంట్లోకి వచ్చి చూడగా, అప్పటికే దీప విగతజీవిగా కనిపించింది. కొడుకు అరుణ్కు ఫోన్ చేయగా, తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. ఇంటికి రమ్మని తండ్రి చెప్పగా, ఈ క్రమంలోనే మార్గమధ్యంలో మమత జిన్నింగ్ సమీపంలో లారీకి వెనుక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. భయంతో లారీని ఢీకొట్టాడా..? ప్రమాదవశాత్తు జరిగిందా..? అనేది తెలియాల్సి ఉన్నది. భర్త, అత్తామామలే తమ కూతురిని పొట్టన పె ట్టుకున్నారని దీప తల్లిదండ్రులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు.