ఆదిలాబాద్ రూరల్/ గుడిహత్నూర్, సెప్టెంబర్ 13 : నూతన పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడం.., సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మంగళవారం ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్, ఎమ్మె ల్యే జోగు రామన్న ఫ్లెక్సీకి.., గుడిహత్నూర్ మం డల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి టీఆర్ఎస్, దళిత సంఘాల నాయకులు పాలాభిషేకం చేశారు.
ఆదిలాబాద్లో ఎస్సీ సెల్ పట్టణాధ్యక్షుడు శైలేందర్ వాగ్మారే, గుడిహత్నూర్లో పార్టీ మండల ఉపాధ్యక్షుడు కేంద్రె మాధవ్ మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి తీర్మానాలు చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ దళిత పక్షపాతి అని గుర్తుచేశారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ దళితుల అభ్యున్నతికి కృషిచేస్తున్నారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు నడువడానికి కారణమైన అంబేద్కర్ను గౌరవించడం కేవలం కేసీఆర్కే సాధ్యమైందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్లో జరిగిన కార్యక్రమంలో నాయకులు సంతో ష్, వసంత్, సాహెబ్రావ్, నవీన్, రవి, వాసుదేవ్.., గుడిహత్నూర్ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్, మాజీ ఎంపీటీసీ కొల్లూరి వినోద్, నాయకులు రావణ్ ముండె, ససానే సిద్ధార్థ్, నీల్కంఠ్ అప్పా, ధమ్మానంద్, డీకే ఆనంద్, ప్రశాంత్, శ్రీనివాస్గౌడ్, డీకే నాందేవ్, సోయం సతీశ్, భీంరావ్ తదితరులు పాల్గొన్నారు.