ఆదిలాబాద్, జూలై 17 ( నమస్తే తెలంగాణ) : మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ(సీసీఐ) పునఃప్రారంభించే విషయంలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్శంకర్ ఆగస్టు 31 లోగా స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని లేదంటే తాను ఆమరణ నిరాహారదీక్ష చేపడుతానని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీసీఐ ప్రారంభమైతే సుమారు 5వేల నుం చి 6 వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. యువతకు ఉపాధి, ఉద్యోగాల కోసం తాను ప్రా ణత్యాగానికైనా సిద్ధమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో సీసీఐని ప్రారంభించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఢిల్లీలో కేంద్ర మంత్రులను పలుమార్లు కలిశామన్నారు. టీఎస్ఐ పాస్లో రాయితీలు కల్పించడంతో పాటు 51:49 విధానం లేదా పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలనే ప్రతిపాదనలు చేసినా కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించలేదని తెలిపారు. సీసీఐ విషయంలో బీఆర్ఎస్ నాయకులు, సాధనకమిటీ సభ్యులు కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిస్తే స్థానిక ఎమ్మెల్యే లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
2018 ఎన్నికల్లో ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖమంత్రి అమిత్షా, గతంలో జిల్లాలో పర్యటించిన కేంద్ర మాజీ మంత్రి హన్స్రాజ్ గంగారం సీసీఐని ప్రారంభిస్తామని హామీ ఇ చ్చినా ఎలాంటి ఫలితం లేదన్నారు. యువత ఓట్ల తో గెలిచిన ఎమ్మెల్యే వారికి ఉపాధి కల్పించే విషయాన్ని పక్కనపెడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కమిషన్లపై దృష్టి సారిస్తూ వేలాది మంది యువత కల్పించే సీసీఐని పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నా బీ జేపీ ఎంపీ, ఎమ్మెల్యే లు కనీసం స్పందించ డం లేదని తెలిపారు. సీ సీఐ స్క్రాప్ టెండర్లను చ ట్టవిరుద్ధంగా జరిపారని, గతంలో ఈ టెండర్లను తా ము అడ్డుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐని తిరిగి ప్రారంభించే బాధ్యత ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉందన్నారు. గడువులోగా స్పష్టమైన వైఖరి రాకపోతే సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ నా యకులు నారాయణ, అజయ్, సా జిదొద్దీన్, రాజన్న, బట్టు సతీశ్, రమేశ్, పరమేశ్వర్, సురేందర్, ఆసిఫ్, అశోక్, అనిల్, దయానంద్ ఉన్నారు.