మంచిర్యాల అర్బన్, జనవరి 29 : పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాల ఆవరణలో ఫ్లడ్లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ముఖ్య అతిథిగా హాజరై చివరి రోజు పోటీలు ప్రారంభించా రు. ఉట్నూర్ జట్టు మొదటి స్థానంలో నిలువగా, రెండో స్థానంలో ఎసన్వాయి, మూడో స్థానంలో మంచిర్యాల జట్లు నిలిచాయి.
అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శంకర్, ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, ట్రినిటీ హైస్కూల్ అధినేత బీజూ కురివిల్లా, పోరెడ్డి రాజు, మెట్టపల్లి సురేందర్, మహేశ్, వంగపల్లి వెంకటేశ్వర్రావు, బెల్లంకొండ మురళి, బోరె యాదగిరి, రావుల రాంమోహన్ పాల్గొన్నారు.