నిర్మల్ అర్బన్, జూలై 17: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బంగల్పేట మహాలక్ష్మి ఆలయంలో నిర్వహించిన బోనాల పండుగకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో నియోజక వర్గంలో 600కు పైగా దేవాలయాలు నిర్మాణం చేసుకున్నామన్నారు. స్థానిక కౌన్సిలర్ బిట్లింగ్ నవీన్, అదుముల్ల పద్మాకర్, ఆలయ చైర్మన్ కొడుకుల గంగాధర్, కోఆప్షన్ సభ్యుడు చిలుక గోవర్ధన్, దేవరకోట డైరెక్టర్ పోతన్న, నాయకులు సుంకరి గాందేశ్వర్, మిట్టపల్లి నర్సయ్య పాల్గొన్నారు.
భైంసాలో గట్టు మైసమ్మకు..
భైంసా, జూలై 17 : పట్టణంలో పలు కుల సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గట్టుమైసమ్మకు బోనాలు సమర్పించారు. కుల పెద్దల ఆధ్వర్యంలో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేతాజీ నగర్ మహిళలు ఆలయంలో ప్రసాద వితరణ చేశారు.
వానల్పాడ్లో..
భైంసాటౌన్, జూలై 17 : మండలంలోని వానల్పాడ్ గ్రామంలో ముత్యాలమ్మ ఆలయ తొలి వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులు పూజలు చేశారు. బోనాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా వెళ్లి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ కల్పనాజాదవ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. సర్పంచ్ మాన్కుర్ పెద్ద రాజన్న, టీఆర్ఎస్ నాయకులు గణేశ్ పాటిల్, రాంకుమార్, ఉప సర్పంచ్ దగ్డే ఈశ్వర్, కారోబార్ నారాయణ, సాయిరెడ్డి పాల్గొన్నారు.
గ్రామ దేవతలకు జలాషేకం
దిలావర్పూర్, జూలై 17 : మండలంలోని న్యూ లోలం గ్రామస్తులు ఆదివారం గ్రామదేవతలకు జలాభిషేకం చేశారు. ఉదయాన్నే గోదావరి నదికి వెళ్లి డప్పు వాయిద్యాల మధ్య జలాలను గ్రామానికి తీసుకువచ్చి పోచమ్మ తల్లి, మహాలక్ష్మి, ఐదు చేతుల పోచమ్మకు అభిషేకం జరిపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కోళ్లను బలిచ్చి మొక్కలు తీర్చుకున్నారు. సర్పంచు ఓడ్నం సవిత, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో…
జైనథ్, జూలై 17 : మండలంలోని కూర గ్రామంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతలకు బోనాలు, నైవేద్యాలు సమర్పించారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.