నార్నూర్, జనవరి 6 : అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తూ అభివృద్ధి, సంక్షేమంలో జోడెడ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగుతున్నదని ఆదిలాబా ద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని బాబేఝరిలో గురువారం రైతుబంధు సంబురాలు నిర్వహించారు. జడ్పీ చైర్మన్ను ఎడ్లబండిపై ఊరేగించారు. ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. క్లస్టర్లోని రైతువేదిక భవనం ఎదుట రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశా రు. రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయం కూడా అందించి న ఘనత కేసీఆర్దేనన్నారు. ఎంపీపీ కనక మోతుబాయి, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, సర్పంచ్ మడావి కైలేశ్వరీసాగర్, మాజీ ఎంపీపీ మెస్రం రూప్దేవ్, మండలాధ్యక్షుడు మెస్రం హన్మంత్రావ్, వ్యవసాయశాఖ అధికారి గిత్తే రమేశ్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు యుర్వేత రూప్దేవ్, సహకార సంఘం డైరెక్టర్లు దుర్గే కాంతారా వ్, రాము, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేశ్, నాయకులు కనక ప్రభాకర్, శ్రీరామ్, మెస్రం మానిక్రావ్, రాథోడ్ ఉత్తమ్, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ పథకాలు , ప్రాజెక్టులు దేశానికే ఆదర్శం
బేల, జనవరి 6 : తెలంగాణ పథకాలు, ప్రాజెక్టులు దేశానికే ఆదర్శమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని సిర్సన్న గ్రామంలో సర్పంచ్ గోదురి భూమన్న అధ్యక్షతన రైతు బంధు సంబురాలు నిర్వహించారు. రైతులలో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతం రైతు వేదికలో సంబురాలు చేసుకొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతుల సంబురాలు చూస్తుంటే సంక్రాంతి ముందే వచ్చినట్లు కనిపిస్తున్నదన్నారు. అనంతరం గ్రామంలోని మరాఠ సంఘ భవ నం నిర్మాణం కోసం మండల నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ , టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు జక్కుల మధుకర్, నాయకులు సతీశ్ పవార్, యూనిస్ అక్బానీ, మస్కే తేజ్రావు, దీపక్ గౌడ్, నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. బేలలోని జడ్పీఎస్ఎస్లో రైతు బంధు సంబురాల్లో భాగంగా వ్యవసాయంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు . టీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, జక్కుల మధుకర్, సతీశ్ పవార్, మస్కే తేజ్రావ్, వాడ్కర్ తేజ్రావ్, ప్రధానోపాధ్యాయుడు కోల నర్సింహులు, ఉపాధ్యాయులు భూమన్న , దేవేందర్, సోనేరావ్, జయకర్, నాయకులు పాల్గొన్నారు.
భీంపూర్ మండలంలో..
భీంపూర్, జనవరి 6 : మండలంలోని హస్నాపూర్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, జడ్పీటీసీ తాటిపెల్లి రాజు టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి తాంసి మండలం హస్నాపూర్ రైతువేదిక వద్ద నిర్వహించిన రైతుబంధు సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంతకుముందు రూ.7.5 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం భూమి పూజ చేశారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్కుమార్, సర్పంచులు జ్యోతి , సదానందం, పీఏసీఎస్ చైర్మన్ ఎస్ విలాస్రెడ్డి, ఎంపీపీ సురుకుంటి మంజులా శ్రీధర్రెడ్డి, వైస్ ఎంపీపీ ముచ్చ రేఖా రఘు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు స్వామి, నాయకులు పులి నారాయణ, అనిల్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
భీంపూర్ రైతువేదిక వద్ద వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏవో రవీందర్ రైతు పథకాలను వివరించారు. జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచులు మడావి లింబాజీ, గొంటిముక్కుల భూమన్న, ఉపసర్పంచ్ జాదవ్ రవీందర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మార్శెట్టి అనిల్, భీంపూర్ రైతుబంధు సమితి అధ్యక్షుడు ఉత్తం రాథోడ్, ఏఈవోలు వికాల్, శంకర్, మహేశ్, సాయి, నాయకులు ధరంసింగ్, జీ నరేందర్యాదవ్, ఎం.కల్చాప్యాదవ్ పాల్గొన్నారు.
రైతుబిడ్డల రంగవల్లులు
రైతుబంధు సంబురాలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో రైతుబిడ్డలైన బాలికలు సందేశాత్మక ముగ్గులు వేశారు. భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామంలో గురువారం సాయంత్రం రైతువేదిక వద్ద సంబురాలు నిర్వహించారు. ఉన్నత పాఠశాలల్లో బాలికలు అందమైన, ఆలోచించదగ్గ ముగ్గులు వేశారు. వీరిని ఏఈవో సంగీత, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచ్ కేమ కళ్యాణి, హెచ్ఎం నగేశ్, రైతులు అభినందించారు.
బజార్హత్నూర్లో..
బజార్హత్నూర్, జనవరి 6 : మండలంలోని మోర్కండి గ్రామంలో రైతు బంధు సంబురాలను ఘనంగా నిర్వహించా రు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రైతులు సీఎం కేసీఆర్ కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు కప్శే అక్షయ్, సర్పంచ్ తోడసం అనిత, రైతు అనుసంధాన కమి టీ మండల అధ్యక్షుడు తరిగే ఉత్తం, ప్రదాన కార్యదర్శి ఆనంద్రావ్, గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు ప్రతాప్ పాల్గొన్నారు.
బోరిగామలో..
ఇచ్చోడ, జనవరి 6 : మండలంలోని బోరిగామ గ్రామంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు బంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, వ్యవసాయం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ కుంట అరుంధతి, ఎంపీటీసీ సింగారపు లచ్చన్న, టీఆర్ఎస్ నాయకులు ముస్కు గంగారెడ్డి, కుంట సురేందర్ రెడ్డి, నోముల గంగారెడ్డి, ఏనుగు నారాయణ రెడ్డి, నజీమొద్దీన్, ప్రభాకర్ రెడ్డి, జమాల్, రైతులు పాల్గొన్నారు.
రైతు బంధు.. దేశానికే ఆదర్శం..
ఆదిలాబాద్ టౌన్, జనవరి 6 : రైతు బంధు పథకం దేశానికే ఆదర్శమని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో రైతు బంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పూలతో అలంకరించిన ‘మన రైతు బంధు-మన కేసీఆర్’ అక్షరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతకుముండు మార్కెట్ యార్డు ఎదుట ఉన్న అన్నదాత విగ్రహానికి పూలమాల వేశారు. ఏడీ శ్రీనివాస్, జేడీఏ ఆశా కుమారి, మార్క్ఫెడ్ ఏడీ పుల్లయ్య, వ్యవసాయశాఖ మండల అధికారులు, రైతులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
గుడిహత్నూర్ మండలం తోషంలో..
గుడిహత్నూర్, జనవరి 6 : గుడిహత్నూర్ మండలం తోషం, పూనగూడ రైతువేదిక వద్ద రైతులు సంబురాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు కలిసి వేదిక వద్ద వేడుకలు నిర్వహించారు. సర్పంచులు సోయం దస్రు, భీంరావ్, ఎంపీటీసీ సగీర్ఖాన్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు బూర్ల లక్ష్మీనారాయణ, రైతు బంధు గ్రామ అధ్యక్షుడు పస్తాపురే రవీందర్, నాయకులు జమీల్, ఆవుల రమేశ్, అలీం, సోయం సతీశ్, నర్వటే సుశీల్, రైతులు పాల్గొన్నారు.
ఉట్నూర్ మండలం తాండ్రలో..
ఉట్నూర్ రూరల్, జనవరి 6: మండలంలోని తాండ్ర గ్రామంలో నిర్వహించిన రైతు బంధు సంబురాల్లో ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొన్నారు. అనంతరం కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. లక్కారం, శ్యాంఫూర్, సాలేవాడ(కే), నర్సాపూర్(బీ) గ్రామాల్లోనూ చెక్కులు అందజేశారు. యేందా గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ భవనానికి భూమిపూజ చేశారు. ఎంపీపీ పంద్ర జైవంత్రావ్, ఎంపీడీవో తిరుమల, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, లక్కారం, శ్యాంపూర్, నర్సాపూర్ సర్పంచ్లు రాథోడ్ జనార్దన్, మల్లిక, కళావతి, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అజీమొద్దీన్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు రషీద్, మాజీ అధ్యక్షుడు సింగారే భరత్, నాయకులు జవ్వాద్ అన్సారీ, సాడిగే రాజ్కుమార్, కేంద్రే రమేశ్, కాటం రమేశ్, కుటకేల ఆశన్న పాల్గొన్నారు.
రైతులకు సన్మానం
బోథ్, జనవరి 6: రైతు బంధు వారోత్సవాలను పురస్కరించుకొని బోథ్లోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఆత్మ కమిటీ చైర్మన్ మల్లెపూల సుభాష్ గురువారం వివిధ గ్రామాలకు చెందిన రైతులను శాలువాలతో సన్మానించి స్వీట్లు తినిపించారు. రైతు బంధు అన్నదాతలకు ఆర్థికంగా బాసటగా నిలిచిందని పేర్కొన్నారు. రైతు బంధుతో కేసీఆర్ పేరు చరిత్ర లో నిలిచిపోతుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులు సం జీవ్రెడ్డి, రఫీ, భీంరావు, బుచ్చన్న, రవియాదవ్ పాల్గొన్నారు.
నార్నూర్ మండలం ఖండ్వొలో..
నార్నూర్, జనవరి 6 : గాదిగూడ మండలంలోని ఖండ్వొ గ్రామంలో గురువారం రైతుబంధు వారోత్సవాలు నిర్వహించారు. రైతులు ఎడ్లబండి ర్యాలీతో సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఈవో సంధ్యారాణి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
నేడు బోథ్లో..
బోథ్, జనవరి 6: బోథ్లో రైతుబంధు సంబురాలను శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ తుల శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు రైతుబంధు పథకంపై వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు ఏర్పాటు చేసి బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ముగ్గుల పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు, రైతుబంధు గ్రామ, మండల కమిటీల అధ్యక్షులు, సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, కో ఆప్షన్ సభ్యులు, సొసైటీ చైర్మన్, మార్కెట్ కమిటీ పాలకవర్గ మాజీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.