జైనథ్, అక్టోబర్ 3 : దేశంలోని అన్నివర్గాల ప్రజలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న విమర్శించారు. సోమవారం జైనథ్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దాంపెల్లి శ్రీకాంత్తో పాటు బీజేపీకి చెందిన 100 మంది నాయకులు, కార్య కర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే జోగు రామన్న పార్టీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అంతకు ముందు బస్టాండ్ ఎదు ట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ర్యాలీగా డీజే సౌండ్, బతుకమ్మల కోలా హాలం మధ్య రోడ్ షో నిర్వహించారు.
అనంత రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభు త్వాలు దేశంలోని ప్రజలకు చేసింది ఏమి లేదన్నా రు. రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక లక్షల్లో ఉద్యోగాలు భర్తీ అయ్యా యన్నారు. ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గణేశ్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తం యాదవ్, నాయకులు గడ్డం జగదీశ్రెడ్డి, లస్మన్న యాదవ్, ఎండోమెంట్ చైర్మన్ పుండ్రు వెంకట్రెడ్డి, సర్పంచ్లు దేవన్న, లస్మన్న, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకుల మతిపోతున్నది..
ఆదిలాబాద్ రూరల్, ఆక్టోబర్ 3 : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి బీజేపీ నాయకులకు మతిపోతున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో సుమారు 47మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కు లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈసందర్భం గా ఆయన మాట్లాడుతూ కేవలం అధికారం కోసమే బీజేపీ నాయకులు ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, పట్టణాధ్యక్షుడు అజయ్, కౌన్సి లర్లు జాదవ్ పవన్ నాయక్, సంజయ్, అశోక్ స్వామి, భూమన్న, రామ్కుమార్ పాల్గొన్నారు.
ఆ రాష్ర్టాల్లో పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు..
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 3: రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడంలేదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జనార్దన్ రెడ్డి గార్డెన్లో మావ ల, ఆదిలాబాద్ రూరల్లో నూతనంగా మంజూ రైన పింఛన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులవన్ని అబద్దపు మాటలన్నారు. కేంద్ర ప్రభుత్వం జన్ధన్ ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామని చెప్పి నేటి వరకు ఎందుకు జమ చేయడం లేదో ప్రజలకు తెలుపాల్సి ఉంటుంద న్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీ నల్లావణిత, ఎంపీపీ దర్శనాల సంగీత, గండ్రత్ రమేశ్, నాయకులు ఏవన్, నల్లా రాజేశ్వర్, జంగుపటేల్, గంగుల కిరణ్, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.