ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 16: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే ప్రజలు టీఆర్ఎస్వైపు మొగ్గు చూపుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని కైలాస్నగర్కు చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజలు విసుగు చెందారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసరాలపై భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అర్చన, మాజీ వైస్ఎంపీపీ గంగారెడ్డి, నాయకులు రామ్కుమార్, ఇజ్జగిరి అశోక్, సురేందర్, అజాజ్, ఎజాజ్, సాబీర్ పాల్గొన్నారు.
మండలంలోని బండలనాగాపూర్ సర్పంచ్ గంగుల వెంకన్న తండ్రి లక్ష్మణ్ ఇటీవల మరణించారు. మంగళవారం సంతాపసభ ఏర్పాటు చేయగా ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావ్, మాజీ ఎంపీ గోడం, డీసీసీబీ చైర్మన్ అడి భోజారెడ్డి నివాళులర్పించారు. ఎంపీపీ సురుకుంటి మంజూలశ్రీధర్రెడ్డి, జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీడీవో ఆకుల భూమయ్య, ఎంపీటీసీలు అశోక్, రఘు, నాయకులు దాస్, భూమారెడ్డి ఉన్నారు.