నిర్మల్ అర్బన్/సోన్, ఆగస్టు 16 : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్, మామడ, లక్ష్మణచాంద, దిలావర్పూర్, నర్సాపూర్, సారంగాపూర్, సోన్ మండలాల్లోని పలువురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థికసాయం మంజూరైంది. వారికి క్యాంపు కార్యాలయంలో మంత్రి మంగళవారం చెక్కులు అందించారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, టీఆర్ఎస్ సోన్ మండల కన్వీనర్ మొహినొద్దీన్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, సర్పంచ్లు వినోద్, సుంచు సుప్రజ శ్రీనివాస్, అంకం గంగామణి, ఇందూరి రాజేందర్, నాయకులు సురేందర్ రెడ్డి, జగన్, ఎంపీపీలు పాల్గొన్నారు.
కవుల పాత్ర కీలకం
కవితల ద్వారా కవులు సమాజాన్ని మరింత చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని తెలుగు, ఉర్దూ కవుల సమ్మేళానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాకు చెందిన 150 మంది కవులు భారత స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి, జాతీయభావంతో కూడిన కవితలను మంత్రి ముందు చదివి వినిపించారు. ఉత్తమ కవులను మంత్రి సన్మానించారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ రాంబాబు, హేమంత్ బోర్కడే, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీఈవో రవీందర్రెడ్డి, కవులు, కళాకారులు పాల్గొన్నారు.