భైంసా, జూలై 1 : పేదింటి ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం భరోసానిస్తున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. భైంసా పట్టణంలోని నర్సింహ కల్యాణ మండపంలో భైంసా పట్టణానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను శుక్రవారం అందజేశారు. నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.
ఈ పథకాలు ఆడపిల్లలున్న కుటుంబాలకు వరం లాంటివని తెలిపారు. ఆడపిల్ల వివాహ సమయంలో పేద కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకపోకుండా రూ.1,00,116 అందించి ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. అనంతరం పలువురికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పీ కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆసిఫ్, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు తోట విజయ్, దశరథ్, కపిల్, షిందే, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, తోట రాము, నాయకులు దిలీప్, లబ్ధిదారులు పాల్గొన్నారు.