తాంసి, జూన్ 22 : ఆయిల్పాం సాగుతో మంచి ఆదాయం ఉంటుందని, రైతులు ఆ దిశగా దృష్టి సారించాలని ఉద్యానశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ప్రేమ్సింగ్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ జిల్లా కార్యాలయంలో ఉద్యాన పంటల సాగుపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి తదితర విషయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పాం సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఈ విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలు అందజేయాలని అన్నారు. అనంతరం మావలలో శ్రీకాంత్రెడ్డి అనే రైతు పాలీహౌజ్లో సాగుచేస్తున్న కాప్సికం పంటను, మదనాపూర్లోని నర్సరీలో పెంచుతున్న ఆయిల్ పాం మొక్కలను పరిశీలించారు. ఆ తర్వాత తాంసి మండలంలోని హస్నాపూర్లో ఆయిల్ ఫాం సాగు చేస్తున్న రైతులతో సమావేశం నిర్వహించారు. ఆయన వెంట ఉద్యానశాఖ అధికారులు ఎస్. మహేశ్, టి.స్వామి, డ్రిప్ ఇరిగేషన్ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు.