బోథ్, జూన్ 22 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి బోథ్ మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తుల శ్రీనివాస్ అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జడ్పీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చిన అంశాల్లో పరిష్కారమైన వాటిని అధికారులు చదివి వినిపించారు. అనంతరం రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. గ్రామ స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని పేర్కొన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు గ్రామస్థాయిలో సమన్వయంతో పని చేయాలని సూచించారు.
మండలంలోని 75 పాఠశాలలకు గాను 40 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న విషయాన్ని డీఈవోతో పాటు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, సహకార సంఘం చైర్మన్ కే ప్రశాంత్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు బీ శ్రీధర్రెడ్డి, తహసీల్దార్ అతిఖొద్దీన్, ఎంపీడీవో రాజేశ్వర్, ఏఈఈలు జాదవ్ ప్రకాశ్, నర్సింగ్, కల్యాణ్, సునీల్, ఎంఈవో భూమారెడ్డి, ఆర్టీసీ కంట్రోలర్ సాయన్న, ఇన్చార్జి సీడీపీవో ఉమారాణి, డిప్యూటీ రేంజ్ అధికారి ప్రమోద్కుమార్, డాక్టర్ నవీన్రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.
బోథ్లో జడ్పీ చైర్మన్ జన్మదిన వేడుకలు
బోథ్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు చైర్మన్ను శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్, నేరడిగొండ జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, పీఏసీఎస్ చైర్మన్ కే ప్రశాంత్, దుర్గం శేఖర్, తదితరులు పాల్గొన్నారు.