ఖానాపూర్ టౌన్, జనవరి 27: అర్హులకే డబుల్ బెడ్రూం ఇండ్లను అందిస్తామని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మున్సిపాలిటీలోని ఒకటో వార్డు గాంధీనగర్లో మున్సిపల్ చైర్మన్ రాజేందర్తో కలిసి డబుల్ బెడ్రూం ఇండ్ల దరఖాస్తులను గురువారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండ్లు ఇప్పిస్తామని మాయ మాటలు చెబితే నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఖలీల్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ చైర్మన్ గంగాధర్, కౌన్సిలర్ కావలి సంతోష్, మున్సిపల్ కమిషనర్ సంతోష్, నాయకులు రాజగంగన్న, జన్నారపు శంకర్, ప్రదీప్, రాజేందర్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఇంద్రవెల్లి, జనవరి 27: మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ 60 మంది లబ్ధ్దిదారులకు కల్యాణ లక్ష్మి , షాదీముబారక్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, గీత్తే ఆశాబాయి, కోవ రాజేశ్వర్, సర్పంచ్లు రాథోడ్ శారద, జవాదే పార్వతీబాయి, ఆడే విజ య, కుడే కైలాస్, ఇంద్రవెల్లి ఉపసర్పంచ్ గణేశ్ టెహెరే, టీఆర్ఎస్ నాయకులు దేవ్పూజె మారుతి, కనక హనుమంత్, శివాజీ, నగేశ్, శ్యాంకేంద్రే, బాబుముండే, రాందాస్ ఉన్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయం..
ఉట్నూర్, జనవరి 27: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఎంపీడీవో సమావేశ మందిరంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్రావు, వైస్ ఎంపీపీ బాలాజీ, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, నాయకులు ప్రభాకర్, రాజేశ్, రవి, నారాయణ ఉన్నారు.
సీసీ రోడ్డు పనులకు భూమిపూజ..
ఉట్నూర్ రూరల్, జనవరి 27: మండలంలోని బీర్సాయిపేట్ గ్రామంలోని చినజీయర్ గురుకులం నుంచి చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే రేఖానాయక్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్రావు, వైస్ ఎంపీపీ బాలాజీ, మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, దాసండ్ల ప్రభాకర్, ధరణి రాజేశ్, సాడిగే రాజ్కుమార్, కామేరి పోశన్న, సత్యం, మోహరాజ్, కైసర్, ఆశన్న, మనోహర్ పాల్గొన్నారు.