నిర్మల్ అర్బన్, మార్చి 29: నీటి పారుదల ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని అరణ్య భవన్లో నీటిపారుదల, అటవీ శాఖ ఉన్నతాధికారులతో పనుల పురోగతిపై మంగళవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు . ప్యాకేజీ 27, యూనిట్-3 పనులు జూన్లోగా పూర్తి చేసి వానకాలంలో 1500 ఎకరాలు, డైరెక్టరీ తూముల ద్వారా 600 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిసెంబర్ నాటికి 18 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నారు. నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి నుంచి మామడ మండలం దిమ్మదుర్తి వరకు 19 కిలోమీటర్ల మేర కెనాల్ తవ్వకం పనులు ఆగస్టు లోగా పూర్తి చేయాలని సూచించారు. ప్యాకేజీ- 28 భూసేకరణలో జ్యాపం, కాంట్రాక్ట్ ఏజెన్సీ అలసత్వంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఆమోదం పొందిన వెంటనే వేరే టెండర్లు పిలిచి కొత్త ఏజెన్సీకి పనులు కేటాయించాలని సూచించారు. సదర్మాట్ బ్యారేజీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, 55 గేట్లను బిగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. వర్షాకాలంలోగా గేట్ల బిగింపు పనులు పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరందించాలని చెప్పారు. నిర్మల్ నియోజకవర్గంలో రూ.89 కోట్లతో నిర్మిస్తున్న చెక్డ్యాంలకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలన్నారు. సమావేశంలో నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, పీసీసీ ఓఎఫ్ఆర్ఎం డొబ్రియల్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్రావు, సీఎఫ్ వినోద్కుమార్, సీఈ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఈ సుశీల్కుమార్, ఈఈ రామారావు, సుశీల్ ఇన్ఫ్రా, మెగా, బృంద, రాఘవ ఏజెన్సీల బాధ్యులు