ఆదిలాబాద్రూరల్, ఏప్రిల్ 19 : పోటీ పరీక్షల కోసం జిల్లా గ్రంథాలయానికి వచ్చి సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అండగా ఉంటామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌతు మనోహర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో అభ్యర్థులు చదువుకునేందుకు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని నాలుగు టేబుళ్లు, 50 స్టడీప్యాడ్లు, పుస్తకాలు మంగళవారం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి జిల్లా గ్రంథాలయ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయానికి తరలివచ్చే వందలాది మందికి ఉపయోగం ఉండాలనే ఉద్దేశంతో వీటిని అందజేశామన్నారు. త్వరలోనే గ్రంథాలయానికి రూ.3.72కోట్లతో నూతన భవనం నిర్మిస్తామని తెలిపారు.
గ్రంథాలయంలో జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనంతో పాటు ఐదు ఫ్యాన్లు, నాలుగు కుర్చీలు, రంజాన్లు అందించినందుకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌతు మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల గ్రంథాలయానికి ప్రిజ్ను అందించిన బీజేపీ జిల్లా నాయకుడు పాయల్ శంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ప్రకాశ్, రాంకుమార్, శ్రీధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.